SBI Alert: జులై 1 నుంచి కొత్త ఛార్జీలు!
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ ఖాతాదారులకు ఓ నిరాశ కలిగించే వార్త అందించింది. బేసిక్ సేవింగ్స్ అంటే జీరో బ్యాలెన్స్ ఖాతా(బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD) కలిగి ఉన్నవారి నుంచి జులై 1 నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు వసూలు చేయనుంది. నగదు ఉపసంహరణ, చెక్బుక్పై పరిమితులు విధించింది. ఆ పరిధి దాటితో రుసుములు వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.
ఎస్బీఐకి చెందిన ఏదైనా బ్రాంచ్, ఏటీఎంలో మొత్తం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరణకు అనుమతి ఇచ్చింది. అంతకంటే ఎక్కువ సార్లు నగదు తీసుకోవాలనుకుంటే.. ప్రతిసారి రూ.15లతో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర బ్యాంకుకు చెందిన ఏటీఎంల నుంచి నగదు తీసుకున్నా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. ఇకపై ఎస్బీఐ, ఎస్బీఐ యేతర ఏటీఎంలు, ఎస్బీఐ బ్రాంచ్లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక BSBD ఖాతా కలిగిన వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ ఎస్బీఐ ఉచితంగా అందజేస్తుంది. ఇక అంతకంటే ఎక్కువ కావాలంటే 10 చెక్ లీవ్స్ కలిగిన బుక్కి రూ.40లతో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 25 చెక్ లీవ్స్ కలిగిన బుక్ కావాలంటే జీఎస్టీతో పాటు రూ.75 కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసరంగా చెక్ బుక్ కావాలని కోరితే.. 10 లీవ్స్కి రూ.50+జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సీనియర్ సిటిజన్లకు మాత్రం చెక్ బుక్ ఛార్జీలు వర్తించవు.
No comments:
Post a Comment